మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కు కరోనా సోకడంతో ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. చిరంజీవి త్వరగా కోలుకోవాలని గెట్ వెల్ సూన్ అంటూ సీఎం ఆకాంక్షించారు.
కాగా తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో టెస్టు చేయించుకోగా.. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని రెండు రోజులు క్రితం ట్విటర్ ద్వారా చిరంజీవి స్వయంగా వెల్లడించారు. తాను హోమ్ క్వారంటైన్లోనే ఉన్నట్లు చెప్పారు.
ఇటీవల నన్ను కలిసిన ప్రతి ఒక్కరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా. త్వరలోనే మీ అందరిని తిరిగి కలుస్తా’అని చిరంజీవి ట్వీట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవికి కరోనా సోకడం ఇది రెండోసారి. ఈ నేపథ్యంలో ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా చిరంజీవి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు.
చిరంజీవి తన కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా… గాడ్ఫాదర్, భోళాశంకర్ సినిమాలతో పాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.