రెండు కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఓ ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్లో నటించేందుకు సాయిపల్లవి అంగీకరించకపోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తమిళ టాప్ హీరో సూర్య సరసన ఆమె నటించిన “ఎన్జీకే” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ యాడ్ గురించి సాయి పల్లవి స్పందించింది. “ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఒకే రంగుతో ఉండరు. ఇది భారతీయుల రంగు. ఆమెరికా, యూరప్ ప్రజలు తెల్లగా ఉంటారు. ఆఫ్రికన్స్కి కూడా వారి రంగు వారికుంది. రంగుతో సంబంధం లేకుండా అందరూ అందంగానే ఉంటారనేది నా భావన. అందుకే ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ను తిరస్కరించాను. ఆ యాడ్ చేయడం వల్ల వచ్చిన డబ్బుతో నేనేం చేసుకుంటాను. ఇంటికెళ్లి మూడు చపాతీలు తిని, కారులో షికారు చేస్తాను. నాకు పెద్ద పెద్ద అవసరాలు లేవు. డబ్బు సంపాదన కంటే నా చుట్టూ ఉన్నవారిని ఆనందంగా ఉంచడానికే నేను ఇష్టపడతాను” అని సాయిపల్లవి చెప్పుకొచ్చింది. .
previous post
next post
మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది సిరి..?