గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తను ప్రత్యర్థులు చితకబాదారు. ఆయన వద్దు అంటూ అరుస్తున్నదాడి ఆపలేదు.
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన సైదాబిని నరసరావు పేటలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అదే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
కాగా బైక్ పై పెళ్లికి వెళ్లి వస్తుండగా దారిలో అడ్డగించి రాళ్లు, కర్రతో చితకబాదారు. పొలానికి సంబంధించిన దారి విషయంలో కావాలనే గొడవపడ్డారని సైదాబి కుమారుడు జిలానీ చెబుతున్నాడు.
అయితే.. పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లెం టౌన్ షిప్ దగ్గర లోని గ్రీన్ ల్యాండ్ హోటల్ వద్ద ఈ గొడవ జరిగింది. తుమ్మలచెరువు టీడీపీ నాయకుడు షేక్ సైదాబీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన చేతులు, కాళ్లు పట్టుకుని రాయితో తీవ్రంగా దాడి చేసే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.