హైదరాబాద్ నగరంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 84 మందిపై మలక్పేట ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం వారిని నాంపల్లిలోని మూడో మెట్రో పాలిటన్ మెజిష్ర్టేట్ కోర్టులో ప్రవేశపెట్టగా, 65 మందికి రూ.2100 చొప్పున జరిమానా, ఆరుగురికి సాధారణ జైలుశిక్షతోపాటు జరిమానా విధించింది. ఇద్దరికి ఒకరోజు జైలు, రూ.2100 జరిమానా, మరో ఇద్దరికి రెండురోజుల జైలు, రూ.2100 జరిమానా, ఇద్దరికి రూ.3300 జరిమానా, రెండురోజుల జైలు, మిగతా 11 మందికి జరిమానాలతోపాటు కోర్టు సమయం ముగిసేవరకు నిలబడి ఉండాలని కోర్టు ఆదేశించింది. ఒకరి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసిందని మలక్పేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డి తెలిపారు.
previous post