ఒకవైపు బుల్లితెరపై యాంకర్గా మరోవైపు వెండితెరపై నటిగా టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ రష్మి. అయితే ఈ ముద్దుగుమ్మ ఓ బంపర్ ఆఫర్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆమె స్టెప్పులేయనుందని విశ్వసనీయ సమాచారం.
చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబినేషన్ లో వస్తున్న భోళా శంకర్. తమిళంలో సూపర్హిట్ అందుకున్న ‘వేదాళం’ రీమేక్గా ‘భోళాశంకర్’ తెరకెక్కుతోంది. ఇందులో చిరు సోదరిగా కీర్తిసురేశ్ నటించనున్నారు. చిరుకు జోడీగా తమన్నా సందడి చేయనున్నారు.
ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది. ఈ సినిమాలో ఒక స్పెషల్ ఐటం సాంగ్ ఉందని టాక్. ఆ సాంగ్ లో చిరుతో రష్మి కాలు కదిపుతుందని చెబుతున్నారు.
అంతా ఓకే అయితే.. ఆ పాటలోనే చిరుతో కలిసి రష్మి డ్యాన్స్ వేయనుందని సమాచారం. శేఖర్ మాస్టర్ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్ ఆఫర్ వరించినట్లే..