telugu navyamedia
క్రైమ్ వార్తలు

విశాఖ జిల్లాలో అమానుషం..

అమ్మవడిలో హాయిగా ఉండాల్సిన ఓ పసికందు ముళ్ళపొదల్లో అల్లాడిపోతున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. కాకులు దూరని కారడవిలో.. ఓ వైపు చల్లని గాలులు.. మరోవైపు ఏకదాటిగా కురుస్తున్న వర్షం..వీటికి తోడు పాపపై చీమలు చేస్తున్న దాడి. ఊహించుకునేందుకే భయంకరంగా ఉన్న ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది.

రోలుగుంట మండలం భోగాపురంలో సమీపంలోని బీఎన్ రోడ్డులో అప్పుడే పుట్టిన పసికందును ముళ్ళపొదల్లో గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్ళారు. ప‌సి బిడ్డ ముళ్ల‌పోద‌ల్లో ఉంద‌న్న స‌మాచారం అందుకున్న ఎఐ నాగ‌కార్తీక్. వెంట‌నే స్పందించి శిశువు ఆస్పత్రికి త‌ర‌లించారు.

ప్ర‌స్తుతం ఆ శిశువు మ‌హిళా శిశు సంక్షేమ అధికార‌లు ఆధీనంలో ఉంది. ఆడ పిల్ల కావ‌డంతోనే వ‌ద్ద‌న‌కొని పొద‌ల్లో వ‌దిలి వేళ్ళార‌ని అనుమానిస్తున్నారు. ద‌ర్యాప్తు చేస్తున్నారు. స‌కాలంలో స్పందించి శిశువును ఆస్పత్రికి చేర్చిన ఎస్ ఐ నాగ‌కార్తీక్ ను స్థానికులు అభినందిస్తున్నారు.

Related posts