గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని విషాదం చోటు చేసుకుంది. ఘట్లోడియా ప్రాంతంలోని ఉన్న వృద్ధ దంపతులను గుర్తుతెలియని దుండగులు వారి ఇంటిలో హత్య చేసి, దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితులు, 90 ఏళ్ల దయానంద్ షాన్బాగ్ మరియు అతని భార్య విజయలక్ష్మి షాన్బాగ్ (80) ఘట్లోడియా ప్రాంతంలోని పరస్మణి సొసైటీలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. వారి కుమారుడు తన కుటుంబంతో కలిసి నగర శివార్లలో నివసిస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం, వృద్ధ దంపతులను కలవడానికి వచ్చిన మరొక సొసైటీ నివాసి, వారి గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉండడంతో పోలీసులకు సమాచాం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
దంపతుల ఇంటిలోని అల్మెరా పగలగొట్టబడి, గదిలో వస్తువులు చెల్లాచెదురుగా కనిపించడంతో, హత్య వెనుక ఉద్దేశ్యం దోపిడీ జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
పోలీసులు స్థానికులు, సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. హంతకులను గుర్తించేందుకు ఆధారాలు కనుగొనేందుకు ఫోరెన్సిక్ నిపుణులు, డాగ్ స్క్వాడ్ను కూడా రప్పించామని, నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.