telugu navyamedia
సినిమా వార్తలు

న‌న్ను గెలిపిస్తే..డబుల్ బెడ్​రూం ఇళ్లు కట్టిస్తా’

టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతుంది. ఒక్కొక్కరిగా నామినేషన్లు వేస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడతూ వచ్చిన ప్రకాష్‌ రాజ్‌ టీమ్‌ నామినేషన్స్ దాఖలు చేసింది. నటుడు సీవీఎల్ కూడా నామినేషన్ వేశారు.

తాజాగా ‘మా’ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శి పదవికి బండ్ల గణేశ్ నామినేషన్ వేశారు. ‘మా’ కార్యాలయంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు బండ్ల గణేశ్. ప్రధాన కార్యదర్శిగా న‌న్ను గెలిపిస్తే.. 100 మంది పేద కళాకారులకు రెండు పడక గదుల ఇళ్లు కట్టిస్తానన్నారు.

తాను ‘మా’ కోసం బిల్డింగ్ కట్టను. ఇప్పుడున్న ఆఫీస్ సరిపోతుందని పేర్కొన్నారు. హైదరాబాద్​లో హీరోలతో గంట సేపు ప్రోగ్రామ్​ పెట్టిస్తా. హీరోల ప్రోగ్రామ్​తో రూ.25 కోట్లు సేకరిస్తాను .

Bandla Ganesh to contest for GS post in MAA polls

మా బిల్డింగ్ కడతాను, చార్మినార్ కడతాను, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతున్నారని, కానీ అవేమి జరిగే పనులు కావని అన్ని అబద్ధాలని విమర్శించారు. విందులు, సమావేశాలతో ఓటర్లను ప్రలోభపెడుతున్నారని బండ్ల గణేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

మహానుభావులు 28 సంవత్సరాల క్రితం మా అసోసియేషన్ పెట్టారని ఇప్పటివరకు ప్రతి అధ్యక్షుడు బాగానే పని చేశారని కొనియాడారు. గత ప్రెసిడెంట్‌ని అన్యాయంగా దింపే ప్రయత్నం చేశారని, తాజాగా ఇప్పుడు కొంతమంది వచ్చి సభ్యులను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై మా ఎలక్షన్ తరువాత మాట్లాడతానన్నారు. ఎన్నికల్లో తనకు పరమేశ్వరుడి మద్దతుందని తెలిపారు. నా విజయాన్ని ఎవరూ ఆపలేరు.  ప్రజల్ని ఎంటర్ టైన్ చేసే మన ఆర్టిస్టులు ఉండగా ఎవరినో ఫండ్ అడగడం ఏంటని ప్రశ్నించారు. తన విజయాన్ని ఎవరు ఆపలేరని, తనకు ఆ పరమేశ్వరుడి సపోర్ట్ ఉందని సభ్యులందరూ మిగతా వాళ్ళు ఇచ్చే తాయిలాలు తీసుకొని ఓటు మాత్రం తనకే వేయాలని సభ్యులను కోరారు.
.

Related posts