హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. నిమజ్జనం సందర్భంగా ఆదివారం వినాయకుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకెళ్లి సజ్జనార్ అందరి దృష్టినీ ఆకర్షించారు. వీసీ సజ్జనార్.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారుండరు. ఏ శాఖలో పనిచేసినా తనదైన ప్రత్యేకతతో అందరి అభిమానాన్ని సంపాదించుకోవడం ఆయన ప్రత్యేకత.
సమర్ధుడైన అధికారిగా పేరున్న ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు ఇచ్చారు. ఇటీవల సింగరేణి ఘటన నిందితుడిని పట్టుకునే క్రమంలో సజ్జనార్ ఆయన స్టైల్లో స్పందించారు. ఇప్పుడు తాజాగా గణేష్ నిమజ్జనం సందర్భంగా మరోసారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ఇంట్లో ప్రతిష్టించిన గణనాథుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకొచ్చారు.
సంప్రదాయ దుస్తుల్లో కుటుంబ సభ్యులతో కలిసి గణనాథుడి ప్రతిమతో ఆయన బస్సులో వినాయక నిమజ్జనానికి తరలి వెళ్లారు. తెల్ల పైజమా, కుర్తా, తెల్ల టోపీ పెట్టుకున్నారు. సజ్జనార్ బస్సులో ప్రయాణిస్తుండగా.. మిగతా ప్యాసింజర్లు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.
వెంట్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదు..పీసీసీ చీఫ్ సమన్వయకర్త మాత్రమే