సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థను , న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని అభ్యంతర కరమైన పోస్ట్లను పెట్టినందుకు సిబిఐ నలుగురు నిందితులపై కేసులు నమోదు చేసింది .గుంటూరులోని న్యాయస్థానంలో ఈ నలుగురిపై నాలుగు వేర్వేరు ఛార్జిషీట్లను దాఖలు చేసింది .
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో న్యాయ వ్యవస్థను కించపరుస్తూ పెడుతున్న పోస్టులపై సీబీఐ దృష్టి పెడుతుంది . తాజాగా ఈ నలుగురిపై సోమవారం రోజు కేసులు నమోదు చేశారు .
మొదటి ఛార్జిషీట్ లో ధని రెడ్డి కొండా రెడ్డిపైన రెండవ ఛార్జిషీట్ లో పాముల సుధీర్పైన , మూడవ ఛార్జిషీట్ లో ఆదర్శ్ పట్టపు (ఆదర్శ్ రెడ్డి) నాల్గవ ఛార్జిషీట్ లో లవనూరు సాంబ శివ రెడ్డి (శివ రెడ్డి) పై కేసులు పెట్టడం జరిగింది