telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెరికాకు 400 మంది అక్రమ రవాణా… ఎన్నారైకి పదేళ్ళ జైలు

NRI

వివిధ దేశాలకు చెందిన సుమారు 400 మందిని అక్రమంగా అమెరికాకు రవాణా చేసినందుకు 61 ఏళ్ల ఎన్నారైని అమెరికా కోర్టు శిక్షించింది. అతనికి 10 ఏళ్ల జైలుశిక్ష విధించింది. 2013 నుంచి 2015 వరకు జరిగిన ఈ అక్రమ రవాణాలో కనీసం ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. యద్వీందర్ సింగ్ సంధు అనే వ్యక్తి.. రకరకాల దొంగ పేర్లు వాడుకొని, భారత్ నుంచే కాక ఇతర దేశాల నుంచి కూడా చాలామందిని అమెరికా చేర్చినట్లు అంగీకరించాడు. వారందరికీ నకిలీ పత్రాలు సృష్టించి అమెరికాకు తీసుకొచ్చినట్లు చెప్పాడు. అంతేకాక ఇలా అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇతరులకు కూడా తాను సహాయపడినట్లు తెలిపాడు.

Related posts