చిరంజీవి మూవీ ఠాగూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి జ్యోతిక. డిఫరెంట్ స్టోరీలతో ఇప్పటికే తన క్రేజ్ ను కంటిన్యూ చేస్తోంది. ఈమె తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ సినిమాల్లో నటించింది. తెలుగు చంద్రముఖి సినిమాతో లకలకలకలక అంటూ తెలుగు ప్రేక్షకులను అంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
2006 సెప్టెంబరు 11 తమిళ స్టార్ హీరో సూర్యను పెళ్లాడి ఇద్దరు పిల్లల తల్లైనప్పటికీ అదే ఎనర్జీ, అందం కొనసాగిస్తోంది. ఈ మధ్యే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక మహిళా ప్రధాన పాత్రలున్న సినిమాలు ఎంచుకుంటూ జనాదరణ పొందుతుంది.
ఇప్పటి వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న జ్యోతిక తాజాగా ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఖాతా తెరిచిందో లేదో.. లక్షల మంది జ్యోతికకు ఫాలోవర్లుగా మారిపోయారు.
మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు అడ్వెంచర్ ట్రిప్పుకు వెళ్లిన జ్యోతిక కాశ్మీరులోని అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ జాతీయ పతాకం ప్రదర్శిస్తూ ఫొటోలు దిగి తన దేశభక్తిని చాటింది. అక్కడ దిగిన ఫొటోలను షేర్ చేస్తూ తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాను తెరిచింది.
తన లాక్ డౌన్ డైరీలోంచి పాజిటివ్ అంశాలను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తా అని చెప్పిన జ్యోతికకు అకౌంట్ ఓపెన్ చేసిన 45 నిమిషాల్లోనే 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లు వచ్చారు. నిమిషాల వ్యవధిలో ఇంతమంది ఫాలోవర్లు రావడం సోషల్ మీడియాలో సంచలనమే. స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని సెన్సేషన్ ను జ్యోతిక క్రియేట్ చేసింది అంటున్నారు సోషల్ మీడియా నిపుణులు.
కశ్మీర్ విభజనపై కమల్హాసన్ సంచలన వ్యాఖ్యలు