చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన డాన్స్ లకు, డైలాగ్ లకు ఎవరైన ఫిదా అయిపోవాల్సిందే. ఆగష్టు 22 తన పుట్టినరోజు సందర్భంగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొనాలని ట్విట్టర్ ద్వారా చిరంజీవి అభిమానులకు పిలుపునిచ్చారు.
ప్రకృతి వైపరీత్యాలు తగ్గాలంటే, కాలుష్యానికి చెక్ పెట్టాలంటే, భవిష్యత్ తరాలు బావుండాలంటే మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని చెప్పారు. అందుకు, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన హరితయజ్ఞం “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో మీరంతా పాల్గొనాలి..మూడు మొక్కలు నాటి, ట్విట్టర్లో ట్యాగ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
చిరు ట్వీట్ పై స్పందించిన ఎంపీ సంతోష్ కుమార్ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై మెగాస్టార్ కి ఉన్న ప్రేమను తెలియజేస్తున్నదని, ఆయన పుట్టిన రోజున అభిమానులంతా మొక్కలు నాటి చిరు కానుకను అందించాలని ఆకాంక్షించారు. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో పాల్గొనే ప్రతీ అభిమాని చిరుకు ట్యాగ్ చేయాలని సంతోష్ కుమార్ సూచించారు. తన నటనతో కోట్లాది మంది హృదయాలను గెలిచిన మెగాస్టార్ ఆయురారోగ్యాలతో కలకాలం అభిమానులను అలరించాలని ఆకాంక్షించారు.
కాగా..ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు చిరు. ఇప్పటికే చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో రామ్చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఆచార్య షూటింగ్ క్లైమాక్స్కు చేరుకుంది. అలాగే లూసిఫర్ రీమేక్ పనులు కుడా మొదలయ్యాయి.