కడపజిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లెలో బీజేపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో వైకాపాకి చెందిన ముగ్గురు, బిజెపీకి చెందిన ఆరుగురు కార్యకర్తలు గాయపడ్డారు.
గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో బిజెపీకి చెందిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ముందు జాగ్రత్తగా గ్రామంలో భారీ బందోబస్తు ఎర్పాటు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని
ఇరు వర్గాలను చెదరగొట్టారు.
కాగా.. గాయపడిన వారిలో బీజేపీ చెందిన కార్యకర్తలు గోపు ప్రసాద్, చిన్న నరసింహులు, పెద్ద నరసింహులు గాయపడ్డారు. వైసీపీ కార్యకర్తలు నరేంద్ర, ఆంజనేయులు గాయపడగా…ఈ ఘర్షణలో గ్రామ వాలంటీర్ వెంకటేష్ కూడా గాయాలయ్యాయి. వాలంటీర్ వెంకటేష్కు, బీజేపీ నాయకుడు ప్రసాద్ మధ్య సంక్షేమ పథకం విషయంలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.