telugu navyamedia
క్రైమ్ వార్తలు

అనుమానంతో భార్య గొంతుకోసిన చంపిన భర్త!

అనుమానంతో భార్యను గొంతుకోసి హతమార్చిన సంఘటన గురువారం బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యపై అనుమానాలు పెంచుకున్నాడు.. దీంతో భర్త కసాయిగా మారాడు. కట్టుకున్న భార్యనే గొంతు కోసి అతి కిరాతకంగా హతమర్చాడు. ఈ హృదయవిదారక ఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే … మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్, షాహిన్ భార్యభర్తలు. వీరికి ఓ కూరుతు, కుమారుడు ఉన్నారు. ఆసిఫ్ లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగు అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కాగా పెళ్లి తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న ఆసిఫ్… అనంతరం మద్యానికి అలవాడు పడ్డాడు. దీంతో రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేవాడు. ఆ తర్వాత భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానాలు పెంచుకున్నాడు. అక్రమ సంబంధాలు కొనసాగిస్తుందంటూ అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆమెను రోజు వేధింపులకు గురి చేసేవాడు.

ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఇంట్లో కొడుకు కూతురు లేకుండా చూసుకున్నాడు. నేడు మధ్యాహ్నం కొడుకును బ్యాంకు పనిమీద పంపించాడు. అనంతరం కూతురు స్నానం కోసమని వెళ్లిన తర్వాత తన పథకాన్ని అమలు చేశాడు. భార్యతో అప్పటికే గోడవకు దిగిన ఆసిఫ్.. పథకం ప్రకారం తనతో ఇంట్లో ఉన్న కత్తితో ఆమె మెడపై నరికాడు…అయితే హత్య సమయంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చే లోపే ఆసిఫ్ ఆమెను దారుణంగా నరికాడు. దీంతో ఆమె ఆక్కడికక్కడే మృత్యువాత పడినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఏసిపి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కాగా హత్య చేసిన ఆసిఫ్ ‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.

Related posts