ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కరోనా బారినపడ్డారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. అందులో ఎమ్మెల్యేకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ కోరారు. కాగా.. తెలంగాణలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 848 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 06 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1043 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,26,085 కు చేరగా.. రికవరీ కేసులు 6,09,947 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,684 గా ఉంది..
previous post
next post