చెన్నై ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. నగదు, సెల్ ఫోన్ కోసం సునీత అనే కోవిడ్ రోగిని హత్య చేసింది ఆసుపత్రి కాంట్రాక్ట్ ఉద్యోగిణి రతీదేవి. మే 23న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్య ఆసుపత్రిలో కనపడడం లేదని ఇది వరకే పోలీసులకు ఫిర్యాదు చేసాడు సునీత భర్త మౌళి.ఆసుపత్రి వెనుక ఈ ఉదయం సునీత మృతదేహం లభ్యమైంది. దాంతో ఘటన వెలుగులోకి రావడంతో నిందితురాలు రతీదేవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న సునీత వద్ద ఉన్న నగదు, సెల్ ఫోన్ కాజేసేందుకే హత్య చేసినట్లు రతీదేవి అంగీకరించింది.
previous post
next post