కరోనా సోకడంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ(55) కన్నుమూశారు. బెంగళూరులో చికిత్స పొందుతూ పరిస్తితి విషమించడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈరోజు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఏడాది జులై లోన్ అశోక్ గస్తీ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్ లో ఉన్నారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో బీజేపీలో చేరారు. 2012లో బీసీ కమిషన్ చైర్మన్గా సేవలందించారు.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. అశోక్ గస్తీ మరణం పట్ల ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.