telugu navyamedia
రాజకీయ వార్తలు

కరోనాతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు కన్నుమూత

Ashok Gasti BJP

కరోనా సోకడంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు అశోక్ గ‌స్తీ(55) క‌న్నుమూశారు. బెంగళూరులో చికిత్స పొందుతూ పరిస్తితి విషమించడంతో ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచారు. ఇటీవల కోవిడ్ టెస్టులు నిర్వహించడంతో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ నెల 2న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈరోజు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఏడాది జులై లోన్ అశోక్ గస్తీ తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచి ఆయన ఆరెస్సెస్ లో ఉన్నారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో బీజేపీలో చేరారు. 2012లో బీసీ క‌మిష‌న్ చైర్మ‌న్‌గా సేవలందించారు.ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ రాజ్యసభ సభ్యుడి వరకు ఎదిగారు. అశోక్ గస్తీ మరణం పట్ల ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

Related posts