సాధారణంగా వయసు పై పడేకొద్దీ చర్మం పటుత్వం కోల్పోయి, ముడతపు పడుతుంది. దీనితో కొందరు అసౌకర్యంగా భావిస్తుంటారు. యుక్త వయసులోనే కొందరు ఈ సమస్యను ఎదుర్కోవటం కూడా జరుగుతుంది. అయితే దీనికి ఆరోగ్య సమస్యలు కూడా కారణం కావచ్చు. ఈ సమస్యల కోసం, ఇంటి చిట్కాలు..కింద తెలిపిన పలు సూచనలు పాటిస్తే దాంతో ఎవరైనా సరే.. చర్మంపై పడే ముడతలను తగ్గించుకోవచ్చు. ఆ సూచనలు ఏమిటో తెలుసుకుందామా..!
* ముఖాన్ని గోరువెచ్చని నీటితో కడుక్కుని తడుచుకున్న తర్వాత నాలుగు చుక్కల నిమ్మరసం ముఖానికి రాసి అరగంట ఆగి ముఖాన్ని నీటితో కడుక్కోవాలి. 15 నుండి 20 రోజులు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది.
* ఆలివ్ ఆయిల్ ని ముఖం మీద నెమ్మదిగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం ముడతలు పడడం తగ్గుతుంది. చర్మం మృదువుగా మారుతుంది.
* చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కున్నప్పుడు వెంటనే టవల్తో తడుచుకోకుండా అలాగే ఆరనిస్తే చర్మం కొంత మేర తేమను పీల్చుకుంటుంది. తద్వారా చర్మానికి తాజాదనం లభిస్తుంది.
* క్యారట్ రసం నిత్యం తాగితే చర్మం మీద ముడతలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.
* బాగా పండిన బొప్పాయి గుజ్జును మెడ, ముఖం మీద రుద్దుకుంటే చర్మానికి మంచి రంగు వస్తుంది. చర్మం మీద ఉండే ముడతలు తగ్గుతాయి.
* కళ్ళమీద, నుదుటిమీద దోసకాయ ముక్కలను రోజూ పెట్టుకోవాలి. ఇలా పదిహేను రోజులు చేస్తే ముడతల సమస్య తగ్గుతుంది.