మన దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. అయితే గోవాలో మాత్రం అత్యథిక పాసిటివిటి రేటు ఉంది. ఇక అక్కడ గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో కరోనా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులకు సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. దేశంలో అవసరాలకు తగినంత ఆక్సిజన్ ఉన్నప్పటికీ సరఫరాకు సంబంధించి అంతరాయం కలుగుతుండటంతో అత్యవసర చికిత్స కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులు అవస్థలు పడుతున్నారు. తాజాగా గోవా కళాశాల ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం 13 మంది మృతి చెందారు. దీంతో నాలుగు రోజుల వ్యవధిలో 70 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు పేర్కొన్నారు. మంగళవారం రోజున 26 మంది, బుధవారం రోజున 20 మంది, గురువారం తెల్లవారు జామున 15 మంది, ఈరోజు ఉదయం 13 మంది మరణించారు.
previous post
మహారాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక… క్షమాపణలు కోరిన బిగ్ బాస్ కంటెస్టెంట్