సరదా కోసం తనపై మీమ్స్, కెమెంట్స్ లాంటివి చేస్తారని, వాటిని ఆస్వాదించి ఊరుకుంటానని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి . తనపై వచ్చే మీమ్స్పై రవిశాస్త్రి మాట్లాడుతూ… ‘సోషల్ మీడియాలో ఇదంతా సరదాగా జరిగే ప్రక్రియ. నెటిజన్లు నవ్వుకోవడానికే అవన్నీ (మీమ్స్, కెమెంట్స్) చేస్తారు. నాకు నష్టం కలిగేలా ఉన్నా ఫర్వాలేదు. నాకేమీ ఇబ్బందీ లేదు. నా పేరు చెప్పుకొని ఒక కూల్డ్రింక్ తాగండి. నా గురించి చేసే మీమ్స్తో ప్రజలు కాసేపు నవ్వుకుంటారు. వాటిని నేను ఎంతో ఆస్వాదిస్తారు. అవి నన్నేం బాధ పెట్టవు’ అని తెలిపాడు. క్రికెట్లో బాగా ఆడుతూ విజయాలు సాధిస్తున్నంత కాలం ప్రజలు సంతోషంగా ఉంటారని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఒకవేళ ఓటములు లేదా వైఫల్యాలు ఎదురైతే అందుకు తగిన విమర్శలు, ప్రతిఫలాలు స్వీకరించాలన్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయిన సందర్భంగా తనపై వచ్చిన ఓ సరదా మీమ్ను సైతం రవిశాస్త్రి ఆస్వాదించిన సంగతి తెలిసిందే. ఎవరో చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసిన శాస్త్రి.. ఆ జోక్ బాగుందని, తనకు నచ్చిందని పేర్కొన్నాడు. ప్రజల ముఖాల్లో కాస్త నవ్వు తెప్పించడం బాగుందన్నాడు. అయితే ఆ ఫొటోలో ‘మ్యాచ్ అయ్యేంతవరకు తాగకుండా ఉండలేనని, రెండు రోజుల్లోనే ఆటను పూర్తి చేశారా?’ అని అర్థం వచ్చేలా మీమ్ రూపొందించడం గమనాహర్హం. రవిశాస్త్రిని మద్యం విషయంలోనే ఎక్కువగా ఆటపట్టిస్తుంటారు అభిమానులు. అలాంటివి కూడా తనను బాధించవని ఆయన వివరించాడు.
కవిత ఓడిపోవడానికి ఫ్యాక్టరీ వివాదమే కారణం: జీవన్ రెడ్డి