పవన్ కు మంత్రి బొత్స కొన్ని సూచనలు చేసారు. మతపరమైన అంశాల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ప్రజలను శాంతి పరిచేలా మాట్లాడాలని మున్సిపల్ శాఖ మాత్యులు బొత్స సత్యనారాయణ సూచించారు. నేడు తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ నివాసానికి విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గుడి,చర్చ్,మసీదు అన్ని ఒక్కటే నని ఎవరి మిద దాడి జరిగినా ఒకేలా స్పందించాలి అని ఆయన స్పష్టం చేశారు. తిరుపతిలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు. ఇక అచ్చెనాయుడు నియోజకవర్గంలో నంది విగ్రహంను ఆ పార్టీ నాయకుల అనుచరులు రోడ్డు మీద పెట్టారన్న ఆయన ఈ విషయం సి.సి ఫుటేజ్ ఆధారంగా తెలిసిందన్నారు. లేదంటే ఈ పని చేసింది వై.సి.పి ప్రభుత్వమే అని టి.డి.పి నాయకులు అనే వారు అని ఆయన అన్నారు. తమకి కులం, మతం సంబంధం లేదని అన్ని వర్గాల వారు తమకి ఒకటేనని తెలిపారు. తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి తో ముందుకు పోతుందన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే వారిని ఖచ్చితంగా తమ ప్రభుత్వం శిక్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చూడాలి మరి దీని పై పవన్ ఎలా స్పందిస్తాడు అనేది.
previous post