టీడీపీ నేతల అవినీతి పొట్ట పగులుతోందని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్, గంటా శ్రీనివాస్, సుజనా చౌదరి, రాయపాటి… ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ బాగా ఉందని… చంద్రబాబు అండ్ కో గ్యాంగ్స్టర్లు, స్కాంస్టర్లు అని జోగి రమేష్ పైర్ అయ్యారు. చంద్రబాబు అవినీతి నీడలో తాబేదా కూరుకుపోయారని… 7, 956 కోట్ల రాయపాటి అవినీతి స్కామ్ లో చంద్రబాబుకు, టీడీపీకి ఉన్న వాటా ఎంత? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎందుకు నోరు విప్పటం లేదని… పోలవరం కాంట్రాక్టు చంద్రబాబు కాదా… రాయపాటి సంస్థకు అప్పగించిందని నిలదీశారు. ధైర్యం ఉంటే తన ఆస్థుల పై సీబీఐ విచారణకు స్వచ్ఛందంగా చంద్రబాబు ముందుకు రావాలని సవాల్ విసిరారు. అనవసరంగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇకనైనా టీడీపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు.
previous post
రొమాంటిక్ సినిమాలంటే చాలా ఇష్టం : నమిత హాట్ కామెంట్స్