గ్రేటర్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. దీంతో అధికార, విపక్షాలు గెలుపే లక్ష్యంగా ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గట్టిగానే ప్రయత్నాలు ముమ్మరం అవుతున్నాయి. అటు అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ తరుణంలో గ్రేటర్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. బీజేపీకి చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ ఇవాళ సభ నిర్వహిస్తున్నారు. మరికాసేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం ఎల్బీ స్టేడియం లో జరగనున్న టీఆర్ఎస్ బహిరంగ సభకు నగరం నలుమూలల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. సీఎం కేసీఆర్ గారు హాజరు కానున్న ఈ సభకు హాజరయ్యేందుకు, బస్సులో బయల్దేరారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ బస్సు లో సభా ప్రాంగణానికి వెళ్తున్నారు.
previous post
next post
నా భార్య నైతిక విలువలున్న మనిషి: సిద్ధూ