telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరిన దుబ్బాక బీజేపీ, కాంగ్రెస్ నేతలు

దుబ్బాక లో హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు బీజేపీ, కాంగ్రెస్ నేతలు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ… బీజేపీ రోజు రోజుకు ఖాళీ అవుతోంది. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది అన్నారు. బీడీ కార్మికులకు 1600 రూపాయలు ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 16 పైసలు బీడీ కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలి అని చెప్పారు. గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు పెన్షన్లు ఇవ్వడంలేదు. అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావే అని తెలిపారు.

యూపీలో వృద్ధులకు, వితంతువులకు బీజేపీ ప్రభుత్వం 500 రూపాయలు ఇస్తోంది. కర్ణాటకలో బీజేపీ 400 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. కానీ తెలంగాణలో మనం 2 వేల పెన్షన్లు ఇస్తున్నాం అన్నారు. బీజేపీదంతా ఢోకాబాజీ మాటలు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో 500 మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. రెండు వేల రూపాయలపెన్షన్ ఇచ్చే తెరాస ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీలు ఎలా విమర్శిస్తున్నాయి అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో బోర్లు, బావులదగ్గర యూనిట్ కు 4 రూపాయల చొప్పున రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు.

Related posts