telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీలో తగ్గని కరోనా ఉధృతి…

corona vairus

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 7.83 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 3986 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,83,132కి కి చేరింది. ఇందులో 36,474 కేసులు యాక్టివ్ గా ఉంటె, 7,40,229 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 23 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6429 కు చేరింది. ఇక జిల్లాల వారీగా తీసుకుంటే, అనంతపురం లో 201, చిత్తూరులో 458, తూర్పుగోదావరి జిల్లాలో 481, గుంటూరులో 496, కడపలో 266, కృష్ణాలో 503, కర్నూలులో 55, నెల్లూరులో 196, ప్రకాశంలో 334, శ్రీకాకుళంలో 168, విశాఖపట్నంలో 218, విజయనగరంలో 82, పశ్చిమ గోదావరిలో 528 కేసులు నమోదయ్యాయి.

Related posts