ప్రతియేటా జరిగే ఎయిర్ ఇండియా షో, ఈ సారి కూడా తలపెట్టారు. దానిలోభాగంగా చేస్తున్న రిహార్సల్స్ లో అపశృతి దొర్లడంతో రెండు విమానాలు ఢీకొన్నాయి. అయినా పైలెట్ల చాకచక్యంతో ప్రమాదం తప్పింది. వివరాలలోకి వెళితే, కర్ణాటకలోని యెలహంక ఏయిర్బేస్లో ‘ఎయిర్ ఇండియా-2019’ షో కోసం చేస్తున్న రిహార్సల్స్లో అపశ్రుతి చోటుచేసుకుంది.
ఈ నెల 23న బెంగళూరులో ప్రారంభంకానున్న ఎయిర్ ఇండియా ప్రదర్శన కోసం పైలట్లు రిహార్సల్స్ చేస్తున్నారు. మంగళవారం రిహార్సల్స్ చేస్తుండగా సూర్యకిరణ్ ఏయిర్ బాటిక్స్ టీమ్కు చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఘటన సమయంలో ముగ్గురు పైలట్లు జెట్ విమానాల్లో ఉన్నట్లు సమాచారం. దుర్ఘటన జరిగిన ప్రాంతమంతా పొగమయమైంది. ఈ ఘటనలో ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.