telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత కరోనా అప్డేట్… మళ్ళీ పెరిగిన కేసులు

Corona

భారత్ లో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 86 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 47,905 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా…కరోనా వల్ల మొత్తం 550 మంది మృతి చెందారు. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 52,718 డిశ్ఛార్జ్ అయ్యారు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86,83,917 కాగా ….దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,89,294 గా ఉన్నాయి. ఇక కరోనా కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 80,66,502 కి చేరింది. “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,28,121కి నమోదైంది. ఇటు దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 92.79 శాతంగా ఉండగా… దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసులు 5.73 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.48 శాతముగా నమోదయ్యింది. అయితే యాక్టీవ్ కేసులు 5 లక్షల కంటే తక్కువగా ఉండటం ఊరట కలిగిస్తున్న విషయం.

Related posts