పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన జవానుల కుటుంబాలకు సాయం అందించేందుకు దాతలు ఇంకా ముందుకు వస్తూనే ఉన్నారు. ఇప్పడు ‘స్వర కోకిల’ లతా మంగేష్కర్ వీర జవానుల కుటుంబాలకు భారీగా విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన లతా మంగేష్కర్ తాను తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ వర్థంతి సందర్భంగా ఏప్రిల్ 24న వీర జవానుల కుటుంబాలకు ఒక కోటి రూపాయల ఆర్ధికసాయం అందించనున్నట్లు ప్రకటించారు.
బాలీవుడ్కు చెందిన ప్రముఖులంతా అమర జవానుల కుటుంబాలకు మద్దతుగా నిలుస్తున్నారని లత పేర్కొన్నారు. తాజాగా భారత్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రమూకలపై దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రతి దాడికి పాక్ దిగనుందనే నేపథ్యంలో దేశంలోని సైనిక స్థావరాలకు హైఅలెర్ట్ ప్రకటించారు.


కోర్టు చీవాట్లు పెడుతున్నా ఒంటెద్దు పోకడలు: జగ్గారెడ్డి