telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

భద్రతాపరంగా జూమ్ యాప్ ను వినియోగించవద్దు: కేంద్ర హోం శాఖ

zoom app

లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో వివిధ సంస్థలకు చెందిన ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా మంది జూమ్ యాప్ ను వినియోగిస్తున్నారని తెలిసింది. ఈ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదని కేంద్ర హోం శాఖ సూచించింది.

భద్రతాపరంగా ఈ యాప్ ను వినియోగించవద్దని ప్రైవేట్ సంస్థలకు సూచిస్తూ ఓ ప్రకటన చేసింది. కాగా, లాక్ డౌన్ ప్రకటన వెలువడిన అనంతరం ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. ఈ యాప్ ద్వారా నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్ కు భద్రత లేకుండా పోయిందని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి.

Related posts