telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

2 terrorists killed in Jammu and Kashmir

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ క్రమంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు మరో వ్యక్తి హతమయ్యాడు. అవంతిపొరలోని గోరిపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.

ఈ తెల్లవారుజామున ఆ ప్రాంతంలో కూబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే తేరుకున్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులతో పాటు వారికి సహకరిస్తున్న మరో వ్యక్తి హతమైనట్టు తెలిపారు.

Related posts