సచివాలయ ఉద్యోగాల పరీక్ష పత్రాలు లీక్ అయిందనడం వాస్తవం కాదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక వేళ పరీక్ష పత్రం లీకైతే ఆరోజే వార్త రావాలి. కానీ ఫలితాలు విడుదలైన రోజు వార్త రావడం ఏంటి? అని ప్రశ్నించారు. చంద్రబాబు పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని అంబటి రాంబాబు ఆరోపించారు.
కోడెల మరణాన్ని ఆయన ప్రస్తావిస్తూ చంద్రబాబు శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని అంబటి హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి.. శివప్రసాద్ది ఆత్మహత్య కాదు, హత్య అని ప్రజలను నమ్మించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నాలుగు రోజుల పాటు కోడెల శవాన్ని అడ్డుగా పెట్టుకుని పొలిటికల్గా ఎంత మైలేజ్ తెచ్చుకోవాలనే తాపత్రయం బాబులో కనిపించిందని తెలిపారు.