వైసీపీ ఎమ్మెల్యే, పూతలపట్టు నియోజక వర్గం, సునీల్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ అధినేత జగన్ను కలిసేందుకు మూడు రోజులుగా హైదరాబాద్లోని జగన్ నివాసమైన లోట్స్పాండ్ వద్ద భార్యతో కలిసి పడిగాపులు కాస్తున్నా సునీల్కు చేదు అనుభవమే ఎదురైంది. ఆయనను లోపలికి వెళ్లకుండా గేటు వద్ద భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
తనకు వైసీపీ టికెట్ దక్కే అవకాశం లేదని సునీల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డాడని పేర్కొన్నారు. తను ఎటువంటి తప్పు చేయలేదని, తెలియక ఏదైనా చేసి ఉంటే క్షమించాలంటూ వీడియో ద్వారా కార్యకర్తలకు పంపిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.