telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోపై హైకోర్టు స్టే!

ap high court

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయా శాఖల ప్రభుత్వ కార్యాలయాలను కర్నూలుకు తరలించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకూ కార్యాలయాల తరలింపును నిలిపివేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

 విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వయిరీస్ ఆఫీసులను తరలించాలని గతంలో ప్రభుత్వం జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. జీవోను సస్పెండ్‌ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts