సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీతో పాటు ప్రతిపక్ష వైసీపీలు అభ్యర్థుల ఎంపిక పై కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ తొలి జాబితా ప్రకటించి ముందంజలో ఉండగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నిక ల్లో బరిలోకి దిగే తమ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం ప్రకటించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. దీనిపై మంగళవారం హైదరాబాద్లో ని లోట్సపాండ్లో కసరత్తు చేశారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వాత ఎప్పుడైనా జాబితాను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. మొత్తం 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలకు గాను తొలి విడతలో కొంతమంది అభ్యర్థులను ప్రకటించాలని వైఎస్ జగన్ నిర్ణయించినట్లు తెలిసింది.