వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ రాజ్యసభ సమావేశాలను బహిష్కరించింది. సభా కార్యక్రమాలపై ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు మాట్లాడారు.
వ్యవసాయ బిల్లుపై ఓటింగ్కు అనుమతి ఇవ్వకపోవడాన్ని వ్యతిరేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.రెండు రోజుల క్రితం జరిగిన సంఘటనలను ఆయన ఖండిస్తున్నట్లు తెలిపారు.
కేవలం సమయం పొడిగించాలని కోరినప్పుడే ఈ సంఘటన ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు. రూల్ 252 అంశం గురించి ప్రస్తావిస్తూ.. ఆంగ్లదినపత్రిక ది హిందూలో వచ్చిన ఎడిటోరియల్ను ఆయన గుర్తు చేశారు. ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరారు.