టెలికాం సంస్థ వొడాఫోన్ తాజాగా సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. రూ.499 కి ఓ నూతన ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అలాగే జీ5 యాప్కు వినియోగదారులకు ఉచిత సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.
ఇక సర్కిల్ను బట్టి ఈ ప్లాన్ వాలిడిటీని 60 నుంచి 70 రోజుల వరకు నిర్ణయించారు. అలాగే రూ.555 ప్రీపెయిడ్ ప్లాన్కు వొడాఫోన్ పలు మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ ప్లాన్కు 70 రోజుల వాలిడిటీని నిర్ణయించగా, ఇకపై 77 రోజుల వాలిడిటీ కస్టమర్లకు లభ్యం కానుంది.