telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పెట్రోలును దాటేసిన డీజిల్ ధర!

petrol bunk

వరుసగా 19వ రోజూకూడా చమురు సంస్థలు ధరలు పెంచాయి. ప్రతి రోజు పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఇబ్బందులకు గురవుయతున్నారు. వాహనాలను రోడ్డుపైకి తీసుకురావడానికి జంకుతున్నారు. డీజిల్‌పై 14 పైసలు, పెట్రోలుపై 16 పైసలు పెంచుతున్నట్టు ప్రకటించాయి.

పెట్రో ధరలు పెరగడం వరుసగా ఇది 19వ రోజు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో డీజిల్ ధర లీటరు రూ.80 దాటేయగా, పెట్రోలు ధర రూ.79.92కు పెరిగింది. సాధారణంగా డీజిల్ ధరకంటే పెట్రోలు ధర అధికంగా ఉంటుంది. కానీ ఢిల్లీలో పెట్రోలు ధర కంటే డీజిల్ ధర ఎక్కువగా ఉండడం గమనార్హం. తాజా పెంపుతో గత 19 రోజుల్లో పెట్రోలుపై రూ. 8.21 పెరగ్గా, డీజిల్ ధర లీటరుకు 10.63 రూపాయలు పెరిగింది.

Related posts