హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం “వాల్మీకి”. ఈ చిత్రంలో పూజా హెగ్డే, మృణాలిని రవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరో వరుణ్ తేజ్ సరికొత్త మాస్ లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే మాస్ ఆడియెన్స్ లో అంచనాలు రేపాడు. తమిళ్ సినిమా “జిగర్తాండ”కు ఈ సినిమా రీమేక్. ఇప్పటివరకు డిఫరెంట్ జోనర్స్లో, విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్తేజ్ ఈ సినిమాలో గ్యాంగ్స్టర్గా మరో డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నారు. ప్రముఖ తమిళ్ హీరో మురళి తనయుడు యువ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక యంగ్ హీరో నితిన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో కన్పించనున్నారట. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజా సమాచారం ప్రకారం విక్టరీ వెంకటేష్ “వాల్మీకి” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా రానున్నారు. ఈ నెల 15న శిల్పా కళా వేదికలో ఈ వేడుక జరగనుంది. ఈ మధ్య కాలంలో జరిగిన చిత్ర వేడుకలకి వెంకీ చీఫ్ గెస్ట్గా హాజరైతే ఆ సినిమాలన్నీ మంచి విజయం సాధించాయి. మహర్షి, ఓ బేబి, జెర్సీ, మజిలి ఇలా పలు చిత్రాల ప్రీ రిలీజ్ వేడుకలకి వెంకీ ముఖ్య అతిధిగా హాజరై చిత్ర విజయంలో పాలు పంచుకున్నారు. మరి వాల్మీకి చిత్రానికి కూడా వెంకటేష్ చీఫ్ గెస్ట్గా హాజరు కానుండడంతో సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని ఆశిద్ధాం. వైవిధ్యమైన కథా చిత్రాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే నటులలో వెంకటేష్ ఒకరు. ఆయన ప్రస్తుతం వెంకీమామ చిత్రంతో బిజీగా ఉన్నారు. అంతకముందు ఎఫ్2 అనే చిత్రంలో వరుణ్తేజ్తో కలిసి ప్రేక్షకుల పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించాడు. ఇందులో వెంకీ ఆసనం అనే ఒక కొత్త ఆసనం కూడా తన అభిమానులకి పరిచయం చేశాడు.
previous post
ఆ సీన్ టీడీపీ వాళ్ళకే ఎక్కువ నచ్చింది… చాలా సంతోషిస్తున్నారు : ఆర్జీవీ