- ప్రముఖ గాయకురాలు ఎస్.జానకి మైసూర్లోని తన బంధువుల ఇంట్లో జారిపడడంతో గాయపడ్డారు. వెంటనే ఆమెని మైసూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నడుముకి గాయం కావడంతో వైద్యులు చికిత్స చేశారు. శస్త్ర చికిత్స అనంతరం శనివారం జానకమ్మని డిశ్చార్జ్ చేశారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్టు జానకి తెలిపారు.
- కర్ణాటక ప్రజలు నన్ను ఎంతగానో అభిమానిస్తారు. వారి ప్రేమ, ప్రార్ధనల వలన త్వరగా కోలుకున్నాను. మైసూర్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను అని జానకి తెలిపారు. సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గాన కోకిలగా పిలవబమడే జానకి తొలిసారి 1956లో పాట పాడారు. దాదాపు 6 దశాబ్ధాలుగా ఆమె తన గానంతో అలరిస్తూనే ఉన్నారు. పలు భాషలలో పాటలు పాడిన జానకికి లెక్కకి మంచిన అభిమానులు ఉన్నారు.
previous post