పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో మలయాళ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. సాగర్ కె.చంద్ర డైరెక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కతున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం పవన్ కల్యాణ్ 40 రోజులు కేటాయించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని ఫిలింనగర్లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే..పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తూ.. తమన్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. పవన్ వైఫ్గా సాయిపల్లవి, రానా వైఫ్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
previous post