telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ స్టార్ సినిమా కోసం రంగంలోకి త్రివిక్రమ్..

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ద‌గ్గుబాటి రానా ప్ర‌ధాన పాత్రల్లో మ‌ల‌యాళ హిట్ మూవీ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. సాగ‌ర్ కె.చంద్ర డైరెక్ష‌న్ లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్క‌తున్న ఈ సినిమా నిన్న అధికారికంగా లాంఛ్ అయింది. ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ల్యాణ్ 40 రోజులు కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఆసక్తికర టైటిల్స్ అన్ని ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే..పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమాకు పనిచేస్తున్న సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తూ.. తమన్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేశాడు. ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్‌ ప్లే త్రివిక్రమ్‌ అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది. పవన్‌ వైఫ్‌గా సాయిపల్లవి, రానా వైఫ్‌గా ఐశ్వర్య రాజేష్‌ నటిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

Related posts