telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కైవసం చేసుకున్న వైసీపీ….

ycp ap

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ దుమ్మురేపుతోంది. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి అదే జోరును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 55 మున్సిపాల్టీలను వైసీపీ దక్కించుకుంది.  తాజాగా గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం వైసీపీ కైవసం చేసుకుంది. మొదటి నుంచి స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించిన వైసీపీ… కార్పొరేషన్ లో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం లభించింది. 58 స్థానాల్లో వైసీపీకి స్పష్టమైన ఆధిక్యం లభించింది. అటు 30 స్థానాలు గెలుచుకుంది టీడీపీ. ఇక జనసేన 3 స్థానాలు గెలువగా.. బీజేపీ 1, సీపీఐ 1, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 4 గెలుపొందారు. అటు విజయవాడ లోనూ వైసీపీ దూసుకుపోతోంది. త్వరలో ఉప ఎన్నికలు జరగబోయే తిరుపతిలోనూ వైసీపీ విజయం సాధించింది.

Related posts