telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కార్యాలయంలో బీజేపీ నేత కాల్చివేత!

gun fire

ఉత్తరప్రదేశ్ లో ఓ బీజేపీ నేతను దుండగలు పట్టపగలు కాల్చిచంపారు. ఘజియాబాద్ జిల్లా మసూరికి చెందిన బీజేపీ నేత బీఎస్ తోమర్ తన కార్యాలయంలో ఉండగానే ను కొందరు దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. తోమర్ తన కార్యాలయంలో ఉండగానే కొందరు దుండగులు బైక్ పై అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆఫీసు లోపలకు వెళ్లి తోమర్ పై ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. అనంతరం బైక్ ను అక్కడే వదిలి ఘటనాస్థలం నుంచి పరారయ్యారు.

కాల్పుల శబ్దం విన్న సిబ్బంది రక్తపు మడగులో పడిపోయిన తోమర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తోమర్ హత్యపై కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

Related posts