telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పీసీసీ మార్పు అనివార్యమైతే నాకు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

jaggareddy in pcc race in telangana

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డి తదితరులు భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పట్లో పీసీసీ అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైతే మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ పదవి కోసం రెడ్డి వర్గానికి చెందిన పది మంది నాయకులు పోటీపడుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు.

Related posts