హైదరాబాద్ లంగర్హౌస్ పోలీస్స్టేషన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గురువారం ఉదయం మొగల్ కా నాలా పిల్లర్ నెంబర్ 101 వద్ద స్కూటీని టిప్పర్ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.