తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమాత్రం సహకరించడం లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అని మండిపడ్డారు. ప్రాజెక్ట్లకు కేంద్రం సహకరించడం లేదని మిషన్ భగీరథకు అవార్డు వచ్చిందని, మిషన్ భగీరథ మంచి కార్యక్రమం అని ప్రధాని మోదీ అన్నారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.
ఢిల్లీలో గ్రామీణ మంచినీటి వార్షిక మంచినీటి సమావేశంలో మిషన్ భగీరథ పథకంపై చర్చ జరిగిందని తెలిపారు. ప్రశంసలు తప్ప కేంద్రం పైసలు మాత్రం ఇవ్వడం లేదని అన్నారు.కేంద్రం పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులకు రూ. 19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని కేటీఆర్ అన్నారు.
దక్షిణ తెలంగాణ ఎడారిగా మారబోతోంది: వీహెచ్