తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటేత్తారు. స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం నిండిపోయింది. భక్తుల క్యూ లైన్ నారాయణవనం ఉద్యాన వనం వరకూ పెరిగింది. నేడు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులకు రేపు దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
సర్వదర్శనానికి కనీసం 20 గంటల సమయం పడుతుందని తెలిపారు. టైమ్ స్లాట్ టోకెన్, రూ. 300 ప్రత్యేక దర్శనం, దివ్య దర్శనం భక్తులకు 4 నుంచి 6 గంటల సమయం పడుతోందని అన్నారు. శనివారం నాడు స్వామివారిని 90 వేల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు. నేడు తిరుమలలో పున్నమి గరుడసేవ జరుగనుండటం, వారాంతం కావడంతోనే రద్దీ పెరిగిందని అధికారులు అంచనా వేశారు.
తెలంగాణ వ్యతిరేకులకే మేలు జరుగుతుంది: విజయశాంతి