telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

రేపటి నుంచి హైదరాబాద్‌లో తిరుమల లడ్డూల విక్రయం

tirumala luddu

లాక్ డౌన్ కారణంగా తిరుమల శ్రీవారి దర్శనం నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూలను మాత్రం టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల్లోని టీటీడీ సమాచార కేంద్రాలు, టీటీడీ కల్యాణమంటపాల్లో లడ్డూల విక్రయాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

రేపటి నుంచి హైదరాబాద్‌లో తిరుమల లడ్డూలను విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. హిమాయత్‌నగర్‌ టీటీడీ కార్యాలయంలో కౌంటర్ల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకుని ఒక్కొక్క లడ్డూను రూ.25 చొప్పున విక్రయిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉండనుంది. హైదరాబాద్‌లో రోజుకు 60వేల లడ్డూలు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది.

Related posts