కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ వెంటనే తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేతలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా రెండు చోట్లా అధికార పక్షాన్ని ఢీకొట్టే ప్రధాన శక్తిగా ఎదిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ‘ఆపరేషన్ కమల్’కు టీడీపీ విలవిల్లాడుతోంది. ఎన్నికల్లో పరాజయ భారం నుంచి పూర్తిగా కోలుకోకమునుపే టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే రాజ్యసభలో టీడీపీ పక్షం బీజేపీలో విలీనం అయిపోయింది.
రాజ్యసభలో టీడీపీ పక్ష నేత సుజనా చౌదరి, ఉప నేత సీఎం రమేశ్, ఇద్దరు సభ్యులు గరికపాటి మోహన్ రావు, టీజీ వెంకటేశ్ కాషాయ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ షాక్ నుంచి ఆ పార్టీ తేరుకోకముందు తెలంగాణ టీడీపీ నేతలు మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఈ నెల 27న టీటీడీపీ నేతలు బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, చాడ సురేష్రెడ్డి, బోడ జనార్థన్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అందుకే కాంగ్రెస్ ను వీడుతున్నాను: ఎమ్మెల్యే లింగయ్య